info@bheemasabha.com

శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి – అద్దంపల్లి

కృత్తిక నక్షత్రం – ద్వితీయ చరణంAddampalli

అద్దంపల్లి గ్రామం చేరుటకు యానాం – ద్రాక్షారామ ప్రధాన రహదారిలో అండ్రంగి వైపు మళ్ళవలెను. ద్రాక్షారామ అండ్రంగి మార్గములో రోడ్డు రవాణాశాఖవారి బస్సు సౌకర్యం ఉన్నను నియమిత సమయములలో ఉండుట వలన ప్రయివేటు వాహనములలో చేరుట ఉత్తమము. ఈ క్షేత్రము కృత్తిక నక్షత్రం రెండవ పాదమునకు చెందినది. ఈ జాతకులు అద్దంపల్లి యందు కొలువైయున్న శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించిన శుభములు చేకూరునని భక్తుల విశ్వాసము. ఈ ఆలయ స్థిత లింగ స్వరూపము సప్తఋషుల ప్రతిష్టయని కథనం.

అంతేకాక ఆలయం కూడా చోళరాజుల కాలంలో నిర్మితమైనట్లు తెలియుచున్నది. అయినను నేటికీ ఏ రకమైన పునరుద్ధరణ కార్యక్రమములు జరిగినట్లు లేదు. ఈ ఆలయమందలి దేవీ స్వరూపమైన పార్వతీదేవి అత్యంత ప్రభావంతమైన శక్తిగా భక్తుల నమ్మకం. అమ్మవారికి మ్రొక్కిన యెడల వారి కష్టములు తీరునని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము మాఘశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు కూడా ఇచట ప్రసిద్ధి.