info@bheemasabha.com

శ్రీ ఉమా సమేత మార్కండేయస్వామి – ఉండూరు

[:te

కృత్తిక నక్షత్రం – చతుర్థచరణంUnduru

ఈ క్షేత్రము కాకినాడ – ద్రాక్షారామ ప్రధాన రహదారిపై కలదు. ఆలయము కూడా రహదారి ప్రక్కనే ఉండడం చేత చేరడం కూడా అత్యంత సులభము. ఈ క్షేత్రము కృత్తిక నక్షత్రము నాలుగవ పాదమునకు చెందినది. ఈ జాతకులు ఉండూరు క్షేత్రములో వేంచేసియున్న శ్రీ ఉమా సమేత మార్కండేయస్వామిని దర్శించుకుని అర్చనాభిషేకాదులు నిర్వహించడం ద్వారా శుభఫలితములను పొందగలరు. ఈ క్షేత్రము పురాతన శైవక్షేత్రములలో ఒకటిగా ఉన్నది. పూర్వ ఆలయము 1906వ సంవత్సరములో నిర్మించబడ్డట్లు ఇచ్చటి శిలాఫలకము ద్వారా తెలియుచున్నది. తిరిగి 1972వ సంవత్సరంలో జీర్ణోద్ధరణ జరిగింది. ఈ ఆలయములో విశాలమైన ముఖ మంటపము మరియు కాలక్షేప మంటపము కలవు. ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, ఆంజనేయస్వామి, చండీశ్వరుల ఉపాలయములు కలవు. ఇటీవల నాగప్రతిష్ట జరిగింది. స్వామివారి దివ్య కళ్యాణోత్సవము ఫాల్గుణశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. ఆ సమయంలో చివరిరోజున వైభవోపేతంగా రథోత్సవం జరుగుతుంది. వీటితో పాటు శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి వైభవోపేతంగా జరుగును.